అహం బ్రహ్మాస్మి - సి.హెచ్.ప్రతాప్

Aham brahmasmi

ఆత్మజ్ఞానం ఎంతో లోతైంది. ఆత్మానుభవం అనే అనుభవం అనుభవైకవేద్యమే కానీ, పుస్తకాల్లో రాసేది, ఉపన్యాసాల్లో వినేది కాదు. స్వయంగా సాధన చేసి అనుభూతి చెందాలి అని ఎందరో సద్గురువులు స్పష్టం చేసారు.దివ్యత్వం అనేది ఒక చోటులో వుండేది కాదు అది అందరిలో ఉంది అని, దానికి ఎటువంటి విచక్షణ ఉండదు.అహం బ్రహ్మాస్మి అంటే నేనే బ్రహ్మనై ఉన్నాను అని చెప్పింది బృహదారణ్యకోపనిషత్తు.

అహం బ్రహ్మ అస్మి' అంటే నేను 'బ్రహ్మ' అగుగాక అని, బ్రహ్మ జ్ఞానం సంపాదించాలని అంతరార్థం. నేనే బ్రహ్మను అంటే నాలోనే 'బ్రహ్మ' ఉన్నాడనే భావన అంతర్గతంగా రావాలి. వేదంలో మరొక మహత్తరమైన వాక్యం వుంది అది 'సర్వం ఖల్విదం బ్రహ్మ'. అంటే ఈ సృష్టిలో ఉన్నదంతా బ్రహ్మమే తప్ప మరేమీ కాదు!ఈ వాక్యాల సారం అర్థమయితే చాలు, భగవంతుడు మరెక్కడో లేడు-మన అందరిలోనూ, అన్ని జీవుల్లోనూ ఉన్నాడనే భావన మనకు పూర్తిగా ప్రతి మనిషిలోను భగవంతుడు కొలువై ఉంటాడు. కానీ చాలా కొద్దిమంది మాత్రమే ఈ విషయాన్ని తెలుసుకుంటారు. సాధన చేసి అంధకారాన్ని పారద్రోలాలి.

నేనే జీవుణ్ణి,నా శరీరమే జగత్తు,నా అంతరాత్మే ఈశ్వరుడు. కాబట్టి నేను గుర్తించినా గుర్తించకపోయినా నేను కూడా బ్రహ్మమే.నేను,నా శరీరం,నా అంతరాత్మ -ఇలా మూడింటినీ,మూడుగా వేరు వేరుగా చూస్తే,మూడింటిదీ తలోదారీ అవుతుంది.మూడింటికీ ఉన్న సంబంధాన్ని,బ్రహ్మాన్ని గుర్తిస్తే,వాటి మధ్య ఐక్యమత్యం వస్తుంది.మనోవాక్కాయకర్మల్లో ఏకత్వం వస్తుంది.ఐకమత్యమే బలం.


పరబ్రహ్మకూ, జీవాత్మకూ భేదం లేదు, రెండూ ఒకటే అని అర్థం.ప్రజ్ఞానమ్‌ బ్రహ్మ అంటే ప్రతి జీవిలో ఉండే స్వస్వరూపానికి సంబంధించిన ఎరుకే బ్రహ్మ!’ అని చెప్పింది ఐతరేయోపనిషత్తు.ఈ విషయాన్నే అవ్రవిందులు అద్భుతంగా చెప్పారు:

శరీరం ఒక ఊబి ,అందులో కూరుకుపోతే బయటకు రావడం చాలా కష్టం. ఎన్నో జన్మలు అందులోనే ఉన్నాం. ఇప్పుడైనా శరీర భావాన్ని వదిలి ఆత్మ వైపు తిరగడం అత్యవసరమని మనిషి గ్రహించిన రోజునే అతడు దివ్యశక్తి సంపన్నుడవుతాడు. ముందుగా వ్యక్తి తనలోని చేతనతో తాదాత్మ్యం చెందాలి. ఆ తరువాత విశ్వ చేతనతో ఏకం కావాలి. అప్పుడు విశ్వాతీతంగా ఉన్న దివ్య చేతన ఈ రెండు స్థాయులతో తనంతట తాను అనుసంధానం చెందుతుంది. అలా జరిగినప్పుడు వ్యక్తిలోని శరీరం, జీవశక్తి, మనసు పూర్తిగా దివ్యతను సంతరించుకొని, రూపాంతరం చెందుతాయి. దివ్య చేతన తమ ద్వారా ప్రకటితం కావడం కోసం పారదర్శకంగా తయారవుతాయి. ఈ స్థాయికి మనం చేరుకున్నప్పుడు - దివ్య చేతన మనలో ఆవరించి, మన మనః ప్రాణదేహాలను రూపాంతరీకరిస్తుంది. అప్పుడు ఆ మానవ జీవితం దివ్య జీవనం అవుతుంది. దివ్యత్వం వైపు మనం వేసే ప్రతి అడుగు భగవంతుడికి ఆనందాన్ని ఇస్తూనే ఉంటుంది. మన నేత్రాలు ధ్యానం కోసం మూసినప్పుడు అంతర్నేత్రం తెరుచుకోవడం, హృదయంలో జ్ఞానకమలం వికసించడం ఆయనకు పరమానందం కలిగించే అంశాలు"

మనిషిగా పుట్టిన ప్రతీవారూ దివ్యత్వం కలవారే అంటోంది వేదం. కానీ నీలో వున్న ఆ దివ్యత్వా న్ని తెలుసుకోలేకపోవడమే అజ్ఞానం. నాలుగు యోగమార్గాల సమ న్వయమే దివ్యయోగం.కర్మయోగం ద్వారా మనలోనున్న దివ్యత్వాన్ని తెలుసుకోవ చ్చు. పనిచేయకుండా ఏ మానవుడు ఉండలేడు, ఉండకూడదు. ప్రతివారూ కారణజన్ములే! అందరికీ కర్తవ్యం ఒకటుంటుంది. లేక పోతే సృష్టించుకోవాలి. అదే ఆత్మశోధన.

మరిన్ని వ్యాసాలు

మన సినిమాల్లో దెయ్యాల గీతాలు.
మన సినిమాల్లో దెయ్యాల గీతాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Prabhutwa patashala
ప్రభుత్వ పాఠశాల
- అరవ విస్సు
నాటి తూనికలు - కొలతలు.
నాటి తూనికలు - కొలతలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Dandudu-dandakaranyam
దండుడు - దండకారణ్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
యోగా.
యోగా.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు