మహిళాసాధికారత సాధించిన మహిళ సాకమ్మ - Aduri.HYmavathi.

Mahila sadhikarata sadhinchina mahila sakamma

 

భగవంతుడు అనేకమందిని అనేక రూపాల్లో ఆదుకుని దరి చేర్చు

కుంటాడు. కష్టాల పరీక్షలు పెట్టి తానే పాస్ చేయించి పైతరగతికి వేస్తాడు.

భగవంతుడు ఒకపెద్ద కఠినాత్ముడైన టీచర్. కష్టాలను ఎలా ఎదుర్కోవాలో,

ఎంత ధైర్యంకావాలో బోధించి కష్టాలను ఇచ్చి ఎదుర్కు న్నాక పొగిడి

చెంతచేర్చుకుని సంతసం అందిస్తాడు.

అలాంటి భాగ్యాన్ని పొందిన ఒక మహిళ మహిళాసాధికారత సాధించిన

మహిళ సాకమ్మ కథ చెప్పుందాం.

మన జీవితాలన్నీ చాలా వరకూ కాఫీతో రోజు ప్రారంభమయ్యే

బతుకు లు. ఐతే అతి సాధారణ పేద కుటుంబంలో పుట్టి ఆకాఫీతోనే

జీవితంలో విజయాన్ని సాధించి ఎంతోమందికి జీవితం అందించి,

సంపాదించిన తన ధనాన్ని సామాజిక కార్యక్రమాలకు ఏమాత్రం వెనుకాడక

దాన ధర్మా ల రూపం లో అందించిన ఒక మహా మనీషి ఐన మహిళ సాకమ్మ.

ఆమెకు కాఫీ పొడిసాకమ్మ అనేపేరు స్థిరపడింది.

సాకమ్మ జననం -

1880లో కర్ణాటకలోని తుంకూరు జిల్లాలోని బీదరే గ్రామం లో

జన్మిం చింది సాకమ్మ.ఆమె చిన్నతనంలోనే తల్లిదండ్రులు జీవనోపాధి

కోసం బెంగుళూరు కు వెళ్లారు. చిన్నతనంలో ఆమె తెలివి, నిష్కల్మషత ,

మంచితనం ఆసక్తి గమనించి తల్లి దండ్రులు ఆమెను పాఠశాలో

చేర్పించారు. ఆమె ఎంతోశ్రధ్ధతో తల్లితండ్రులు కష్టపడుతూ తనను

చదివించడం గుర్తుంచుకుని చక్కగా ,శ్రధ్ధగా చదవసాగింది.

మైసూర్ ప్రావిన్సులో సెకండరీ స్కూల్ మొదటి తరగతిలో పాసైన

కొద్దిమందిలో ఈమె ఉంది.పరీక్షపాసైంది.

 

అయితే ఆ తర్వాత మధ్యతరగతి కుటుంబం కష్టాల్లో పడటంతో 16 ఏళ్ల

వయసులోనే సాకమ్మకు పెళ్లి చేయాల్సి వచ్చింది వారికి. పరిస్థితుల ఒత్తిడి

వలన ఎంతో తెలివైనదైన సాకమ్మ తల్లి తండ్రులు చేసే వివాహానికి తల

వొగ్గింది. సావ్కర్ దొడ్డమానె చిక్కబసప్ప శెట్టి, కూర్గ్ కు చెందిన సంపన్న

కాఫీ తోటయజమాని . అతనికి అప్పటికే ఇద్దరు భార్యలు ఉన్నారు.అంటే

సుమారుగా నాలుగు పదుల వయసు ఉండ వచ్చు.సాకమ్మ అతనికి మూడవ

భార్యగా ఆ సంపన్న కుటుంబానికి వెళ్ళింది.

ధనవంతుల భార్యగా జీవితంలో స్థిరపడిన సాకమ్మ పెళ్లయిన

రెండేళ్ల లోనే భర్తను కోల్పోయింది. సంతానం కలుగలేదు. అతని మిగిలిన

ఇద్దరు భార్యలు వెంటవెంటనే వెంబడించారు, ఆ యువతి అకస్మాత్తుగా

ఏకైక యజమానిగా మారిన విశాలమైన కాఫీ ఎస్టేట్ను నిర్వహించడానికి

కష్టపడింది.

చిక్కమగళూరు నుంచి అరక్కు లోయ వరకు ఉన్న ఆమె కాఫోతోట

లను ఎంతో శ్రధ్ధతో గమనించేది. మానవులకు కాఫీకి ఉన్న సంబం ధాన్ని

గుర్తించింది ఆమె.

తన పాఠశాల విద్యను సద్వినియోగం చేసుకున్న సాకమ్మ త్వరగా

కాఫీ ఎస్టేట్ నడపడం నేర్చుకుని దాని నిర్వహణలో నిమగ్నమైంది. కఠినమై

న అడ్మినిస్ట్రేటర్ అయిన ఆమె అనతికాలంలోనే మళ్లీ ఎస్టేట్ అభివృద్ధి

చేసింది.

కాఫీ వ్యాపారాన్ని విస్తరించాలనే ఉద్దేశంతో 1920లో సాకమ్మ

బెంగుళూరు కు మకాం మార్చారు. బసవనగుడిలో తన ఇంటిని ఏర్పాటు

చేసుకున్న ఆమె బుల్ టెంపుల్ రోడ్డు సమీపంలో కాఫీ క్యూరింగ్ కమ్ పౌడర్

యూనిట్ ను ప్రారంభించింది.

సాకమ్మ కాఫీ మిశ్రమం ఆమె నగరం అంతటా వ్యాపించడంతో, ఆమె

పేరు ప్రఖ్యాతులు కూడా పెరిగాయి. ఈ వెంచర్ కు వచ్చిన అద్భుతమైన

స్పందనతో ఉత్తేజితు రాలైన ఈ యువ పారిశ్రామికవేత్త నగరంలోని వివిధ

ప్రాంతాల్లో కేంద్రాలను ఏర్పాటు చేసి కాఫీ పొడి సాకమ్మ అనే పేరును

సంపాదించుకుంది.

అనతికాలంలోనే బెంగళూరులో సాకమ్మ కాఫీ వర్క్స్

అభివృధ్ధిచెందింది. నగరానికి చెందిన సాహితీ దిగ్గజాలు మాస్తి వెంకటేశ

అయ్యంగార్, డి.వి.గుండప్ప వంటి వారు తమ రచనల్లో సాకమ్మ కాఫీపొడి

గురించి ప్రస్తావించేవారు.

సాకమ్మస్రమ ఫలించి , కాఫీ తోటలతో పాటు వ్యాపారమూ ఎంతో అభి

వృధ్ధి ఐంది. తన ప్రయత్నాలన్నీ విజయవంతమై ధన ఒనకూడటం తో

ఆమె తన సమయాన్ని వివిధ సామాజిక కార్యక్రమాల కు కేటాయించ డం

ప్రారంభించారు. ఈ సమాజిక కార్యక్రమాలకు ఆమె చేసిన సేవల ద్వారా

ఆమె పేరు, కీర్తి, అనతికాలంలోనే బెంగళూరులోని ప్రముఖులలో ఆమెకు

స్థానం సంపాదించి పెట్టాయి.

సంస్థానంలో పారిశ్రామిక అభివృద్ధి ప్రణాళికలో సహాయపడటానికి

అప్పటి మైసూర్ ప్రభుత్వం ఆహ్వానించిన నగర వ్యాపార సంఘంలో ఆమె

ఒకరు. వెంటనే సహాయం చేయడానికి అంగీకరించిన సాకమ్మ కురుహిన శెట్టి

కేంద్ర సంఘం, బసవనగుడిలోని న్యూ నేషనల్ హైస్కూల్ రోడ్డులో ఉన్న

హాస్టల్ స్థాపించను ఆమె ఉదారంగాధనం ఇచ్చింది.

అనేక ఇతర సంస్థలతో పాటు, ప్రయాణీకుల కోసం ఒక సత్రం వసతి

గృహాన్ని ఆమె కట్టించింది. దానిని సాకమ్మ భవన్ అని పిలుస్తారు. చౌరస్తా

అక్కడ ఆమె చిత్రపటం ఇప్పటికీ ఉంది. నిజానికి బసవనగుడి లో ఆమె

కాఫీ క్యూరింగ్ యూనిట్ నడుపుతున్న ప్రాంతాన్ని ఇప్పటికీ సాకమ్మ గార్డెన్

అని పిలుస్తారు

వ్యాపార, సాంఘిక సంక్షేమానికి ఆమె చేసిన సేవలను గుర్తించిన

మైసూరు మహారాజు శ్రీ కృష్ణ రాజా వడయార్ సాకమ్మను 'లోకసేవ పారాయి

ని' (సమాజ సేవకు అంకితమైన వ్యక్తి) అనే ప్రతిష్ఠాత్మక బిరుదుతో

సత్కరించారు. వ్యాపార, వాణిజ్య రంగాల్లో మహిళలకు పరిమిత అవకాశాలు

ఉన్న కాలంలో ఆమె సాధించిన విజయాలను చూసి బ్రిటీష్ వారు సైతం

విస్మయం చెంది ఆమెకు 'కైసర్-ఇ-హింద్' (జువెల్ ఆఫ్ ఇండియా) పతకాన్ని

ప్రదానం చేశారు.

భగవంతునిమనస్పూర్తిగా విశ్వసించడం వలన సాకమ్మ తన జీవిత

ప్రయాణంలో ముందుకు నడిచింది. ఆమె తన జీవితమంతా తన దైవ

సేవకు, సమాజసేవకు అంకితం చేసింది. ప్రశాంతి నిలయం ఆశ్రమం

వ్యవస్థాపకుల్లో ఆమె ఒకరు. వృద్ధురాలు, వినయవంతురాలైన ఆ మహిళ

భక్తిని, సహకారాన్ని చూసిఅంతా ఆమెను గౌరవించేవారు. కాఫీ పోడి

సాకమ్మ చాలా భక్తితో వినయంగా ఉండేది.

సేవాహృదయం ఉన్న ఈ మహిళ బెంగళూరు నుండి వచ్చిన

మొదటి కొద్ది మందిసత్యసాయి భక్తులలో ఒకరు. సత్యసాయిబాబా ఆమె

ఇంట్లోనే కొంతకాలం మైసూరు వెళ్ళినపుడు గడిపేవారు. ఆమె తెలుగు

అనర్గళంగా మాట్లాడగలదు. 18, 20 ఏళ్ళ వయసున్న సత్యసాయి బాబాను

సాకమ్మ తన బిడ్డగా భావించి బాబాకు ఆహారాన్ని వండిపెట్టేది.

 

'సత్యం శివం సుందరం'లో శ్రీ కస్తూరి బాబా గురించి సాకమ్మకు ఎలా

తెలిసిందనే ఆసక్తికరమైన కథ వ్రాశారు.

ఒక రోజు ఆమె పూజగదిలో ఉండగా, ఆమెకు చూడను ఇరువురు

సందర్శకులు వచ్చారని నౌకర్ చెప్తాడు. వారిని ఆమె లోనికి ఆహ్వా

నిస్తుంది. ఒకరు ఋషిలా కనిపించే పొడవాటి ముసలివాడు కాగా, మరొకరు

'కైలాష్ కమిటీ' అనే నేమ్ ప్లేట్ తో కారు చక్రం మీద ఉన్న టీనేజ్

కుర్రాడు. ఆమె వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇస్తుంది. వారికోరిక

మేరకు ఆమె వెయ్యి రూపాయలు విరాళంగా ఇచ్చి 'కైలాష్ కమిటీ'లో

సభ్యురాలవు తుంది. ఆమె చెక్కువ్రాసి ఇవ్వబోగా ఆ మొత్తాన్ని

అవసరమైనప్పుడు వసూలు చేసుకుంటామని చెప్పి ఆ చెక్కు

తీసుకోకుండానే వారు వెళ్ళిపోతారు. కొద్దిసేపటికే ఇద్దరూ కారులోనే

అదృశ్యమయ్యారు. కొన్నేళ్ళ తర్వాత బాబా ఒకసారి సాకమ్మ బెంగుళూ రు

లో సత్యసాయి బాబా అనే ఒక యువ సన్యాసి వచ్చి ఉన్నారనితెలిసి

వెళ్తుంది .

రెండు సంవత్సరాల క్రితం తన ఇంటికి కైలాస్ కమిటీ కి ధనంఇవ్వ మని

వచ్చిన అదే టీనేజ్ డ్రైవర్ గా ఒకసారి, వృధ్ధ ఋషిగా ఒకసారీ సాకమ్మకు

బాబాగారు దర్శనమిచ్చాడు.ఆమెతో మాట్లాడుతూ ఆమె ఇవ్వజూపిన

వెయ్యి రూపాయలు ఇప్పుడు ఇవ్వమని చెప్పి బాబా సాకమ్మను ఆశ్చర్య

పరిచాడు . అప్పటి నుంచి సాకమ్మ పుట్టపర్తికి క్రమం తప్పకుండా వస్తూ

ఉండేది.ఆమె దైవ సన్నిధిలో గడిపేవారు.

తన కాలంలో అతికొద్ది మంది మహిళలు మాత్రమే జీవించి ఉన్న బెంగళూ

రుకు చెందిన 'కాఫీ పూడి' సాకమ్మ 1950లో తన 75వ యేట కన్నుమూశారు.

బెంగళూరు నగరం గురించి, దాని వ్యవస్థాపక పితామహుల గురించి,

మధ్యయుగ, ఆధునిక పితామహుల విజయాల గురించి రాసేటప్పుడు

కొంతమందిని వదిలిపెట్టారు. అయినా సాకమ్మ వంటి మార్గదర్శక మహిళల

కథలు ఎందరెందరి హృదయాల్లోనో దాగి ఉన్నాయి . అందరికీ తెలియపరచడమే

ఈ వ్యాసం ధ్యేయం.

***

 

 

మరిన్ని వ్యాసాలు

పంచ ప్రయాగ.
పంచ ప్రయాగ.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
కృష్ణణ్ - పంజు .
కృష్ణణ్ - పంజు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సప్త బద్రి.
సప్త బద్రి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాటల పల్లకి
పాటల పల్లకి
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు