సిరాశ్రీ ప్రశ్న - సిరాశ్రీ

sirasri  question

1. ఆకలి, భయం అనే కారణాల చేత ఒక జంతువు ఇంకో జంతువును చంపడం ప్రకృతి విధించిన జంతుధర్నం. మనిషి కూడా అలా ప్రవర్తించడం ప్రకృతి సహజమే. కాబట్టి ఆహరం కోసం, భయం వల్ల చేసే జంతుహింస తప్పు కాదు.

 2. మనిషి జంతువే కానీ విజ్ఞతనెరిగిన జంతువు. ఆహారం కోసం సాటి జంతువు ప్రాణం తీయడం అమానుషం. భయం, అసహ్యం అనే నెపంతో కూడా కొన్ని జంతువులను చంపడం మనిషి కౄరమైన స్వార్థానికి నిదర్శనం. అది మహాపాపం.

పై రెండిట్లో ఏది కరెక్ట్?